ఉక్కు మనిషికి ఘన నివాళులు.. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Monday November 01, 2021

జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జాతీయ సమైక్యత కోసం వసంత ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర్య సమర యోధుడుగా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషి చేసిన ఘనుడని వసంత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సుందర వరధారాజన్ జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్ వేణుగోపాల్ తండ్రి గారు సాంబయ్య శర్మ ఇటీవల స్వర్గస్థులైన నేపథ్యంలో వారిని పరామర్శించిన అనంతరం ఆదివారం రోజున సహపంక్తి భోజన కార్యక్రమంలో భాగంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్.