రాజ్యాంగ నిర్మాతకు గణ నివాళులర్పించిన బూర్గంపాడు ఎస్సై సంతోష్ కుమార్. బూర్గంపాడు (ప్రజా పాల
Published: Wednesday December 07, 2022
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం లో అంబేద్కర్ కు నివాళి అర్పించిన ఎస్సై సంతోష్ .బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రజల పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్ కి నిర్వచనం గా పిలవబడే ఎస్సై . పి. సంతోష్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాల తో నివాళి అర్పించి ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగంను గౌరవించి, చట్టాలను అనుసరించి సతప్రవర్తనతో నడుచుకోవాలని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పడ్డ కష్టాన్ని అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత హోదాకి ఎదిగిన శిఖరం అంబేద్కర్ అని అన్నారు.ప్రతి ఒక్కరు అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నాయకులు దేపంగి రామచంద్ర, దేపంగి రమణయ్య, మిరియాల ముసలయ్య, చక్క నరసింహారావు, చంద్రుగొండ నరేష్, సిద్దెల సందీప్ తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: