మండల నూతన వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి

Published: Tuesday January 03, 2023

బోనకల్, జనవరి 03 ప్రజా పాలన ప్రతినిధి: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని కామేపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు పద్దతిపై గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చి బోనకల్ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ వైద్యాధికారి నియమితులై మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మండలంలో ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మండల ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చడంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన స్రవంతికి పల్లె దవాఖాన వైద్యాధికారి ప్రదీప్, సిహెచ్ఓ శ్రీనివాసరావు, సూపర్వైజర్లు ఎం. దానయ్య, స్వర్ణమార్త, స్టాఫ్ నర్స్ భవాని, ఫార్మసిస్ట్ రాధాలత, ఎల్ టి నాగరాజు, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు అభినందనలు తెలిపారు.