కళ్యాణ లక్ష్మి పేదలకు వరం : జెడ్పిటిసి నాగిరెడ్డి
Published: Tuesday June 01, 2021
పరిగి, ప్రజాపాలన ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఎంతో ఉపయోగం అని జెడ్పిటిసి కె నాగిరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో జెడ్పిటిసి నాగిరెడ్డి ఎంపీపీ అనసూయ స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదగా 29 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పెదింటి ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ వైస్ ఎంపీపీ మల్లేశం స్థానిక ఎంపిటిసి అనిత యాదయ్య గౌడ్ కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాష రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మయ్య జిల్లా గ్రంథాలయ శాఖ డైరెక్టర్ యాదయ్య గౌడ్ ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ వార్డు నెంబర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Share this on your social network: