ఉపాధి పధకం పై అదనపు డిఆర్డివో సమీక్ష..

Published: Monday September 26, 2022
పాలేరు సెప్టెంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హమీ పథకం అమలు పై ఆదివారం సమీక్ష సమావేశం ను నిర్వహించారు. అదనపు డీఆర్డీవో డి. శిరీష గుడ్ గవర్నెర్స్ కార్యక్రమంలో భాగంగా పంచాయతీల వారీగా జరిగిన పనుల పై సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో 7. రిజిస్టర్స్, వర్క్ ఫైల్స్, వర్క్ సైట్స్ బోర్డ్స్, జాబ్ కార్డ్స్ అస్టేషన్స్ గురించి చర్చించారు. అందుకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామాల వారీగా ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. పంచాయతీల వారీగా కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపాధి హమీ పథకం కు సంబంధించిన వివరాలను సమగ్రంగా తెలుసుకున్నారు. కేంద్ర బృందం పర్యటన సందర్భంగా రికార్డులతో 'సిద్ధంగా ఉండాలని సూచించారు. నేమ్ బోర్డ్స్ క్షేత్ర స్థాయిలో కనిపించాలని ఆదేశించారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో సీనియర్ అసిసెంట్ రాజేష్, ఎంపీడీఓ,
 కె.జమలారెడ్డి, మండల పంచాయతీ అధికారి సి.హెచ్.శివ. ఈజీఎస్ ఏపీవో సునీత, ఈసీ శేషగిరిరావు. టెక్నికల్ అసిస్టెంట్స్ శైలజ, యాకయ్య, గోపి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.