బసవేశ్వరుని ఆశయాలను సాధించాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Saturday May 15, 2021

వికారాబాద్, 14 మే, ప్రజాపాలన బ్యూరో : మహాత్మా బసవ జయంతి సందర్భంగా శుక్రవారం రోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ పట్టణంలో (ఎంఆర్పి) చౌరస్తా సమీపంలో గల బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.... బసవేశ్వరుని ఆశయాలను సాధించాలన్నారు, వీరశైవ సమాజం అభివృద్ధి కోసం బసవేశ్వరుడు చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. బసవేశ్వరుడు కుల, మత మరియు ప్రాంతీయ బేధాలు లేకుండా మానవులంతా ఒక్కటే అని పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. బసవేశ్వరుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, ఏఎంసి, చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.