జర్నలిస్టులను అన్నివిధాలా ఆదుకోవాల్సిన భాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

Published: Wednesday April 28, 2021
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్
పటాన్చెరు, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా సమయంలోనూ ప్రభుత్వ శాఖలతో సమానంగా విధులు నిర్వహించిన జర్నలిస్టులకు ఎలాంటి సహాయం చేయకపోవటం శోచనీయమని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఆయన మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఆదుకున్న ప్రభుత్వం, జర్నలిస్టుల విషయంలో ఎందుకు తాత్సర్యం చేస్తుందోనని ప్రశ్నించారు. జర్నలిస్టులకు రూ.10 వేల పారితోషికంతో పాటు, 25 కేజీల బియ్యాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తులో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, షరతులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన నగదును అందజేయాలని డిమాండ్ చేశారు.