బహుజన సమాజ్ పార్టీ లో చేరిన చెరుకూరి రాజు

Published: Monday August 23, 2021
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 22 ప్రజాపాలన ప్రతినిధి : స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బి ఎస్ పి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రోజు ఇబ్రహీంపట్నం పోల్కంపల్లి చెందిన చెరుకూరి రాజు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకూరి రాజు మాట్లాడుతూ తెలంగాణలో బహుజనరాజ్యం తథ్యమని బిఎస్పీలో చేరిన సందర్భంగా అన్నారు. ఆధిపత్య కులాల వారి రాజకీయ క్రీడకు అంతం పలికే రోజు త్వరలోనే ఉందని ఆయన చెప్పారు. కేసీఆర్ విచ్చల విడిగా డబ్బులు ఇపుడెందుకు ఖర్చు చేస్తున్నారని, ఆయన పంచుతానన్న వెయ్యి కోట్లు ఎవరివి,  కేసీఆర్‌కు దళితులపై అంత ప్రేముంటే ఆయన సొంత ఆస్తులను అమ్మి పంచాలని రాజు అన్నారు. దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే వారికి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కొన్నేళ్లుగా నియామకాలే చేపట్టట్లేదు. ప్రజలను బాగుచేసే ఉద్దేశం అసలు ఈ ప్రభుత్వానికి ఉందా ప్రశ్నించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సాధించాలనుకునే లక్ష్యాలు ఆయన ప్రకటించబోయే రాజకీయ అజెండాపై ఆధారపడి పని చేస్తానని వాగ్దానం చేశారు.