శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బిజెపి శ్రేణులు

Published: Wednesday July 07, 2021

మంచిర్యాల టౌన్, జూలై 06, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోమంగళవారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వివిధ వార్డుల లో శ్యామ్ ముఖర్జీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మొక్కలు నాటారు, ఈ సంద్భంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్. పి. పి మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ. యావత్ భారతావని ఏకీకరణ కోసం శ్యామ్ ముఖర్జీ కృషి చేశాడని ఆయన తెలిపారు. శ్యామ్ ముఖర్జీ భరతమాత ముద్దు బిడ్డఅని, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడని, ఆయన ఆశయాలను ప్రతీ కార్యకర్త కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అరిగెల రవీందర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెజ్జంకి కవిత, యువమోర్ఛా అధ్యక్షుడు కడకొండ సాయి కుమార్, బీసీ మోర్చా అధ్యక్షుడు పాల రాజయ్య, ప్రధాన కార్యదర్శి సాటపురి శివ, ఎస్, సి మోర్చా అధ్యక్షుడు బంగారు ప్రసాద్, నాయకులు జంగపెల్లి మల్లయ్య, గొడిశెల తిరుపతి, శివకుమార్, శాన గొండ రాజ్ కుమార్, ఒరగంటి సాయి తదితరులు పాల్గొన్నారు.