డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Tuesday November 08, 2022
మేడిపల్లి, నవంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం
 కార్పొరేటర్ మందముల                   రజితపరమేశ్వర్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో కలిసి డివిజన్లోని  
ఉప్పల్ హిల్స్ లో విస్తృతంగా  పర్యటించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి పలు సమస్యలను తెచ్చారు. నూతన మంచినీటి పైప్ లైన్ ,డ్రెయినేజీ, సీసీ రోడ్ తదితర సమస్యలను రజితపరమేశ్వర్ రెడ్డికి  తెలిపారు. 
కాలనీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిఈ రజనీకాంత్ రెడ్డి, ఏఈ వసంత ,శానిటేషన్ సూపర్ వైస్సార్ రాజేశ్వర్ రెడ్డి ,కాలనీ అధ్యక్షులు అబ్బయ్య ,దుర్గం నవీన్ యాదవ్ ,సుధాకర్ యాదవ్ ,బోలగని శ్రీనివాస్ ,గోవింద్ కుమార్ ,సంతోష్ రెడ్డి పి రమసెందుర్ హరి కృష్ణ చారి, నర్సిహ్మా. గౌడ్ శ్రీహరి కుమ్మరి సోమయ క్లైమేట్ దినేష్ రాజు కుమార్ ,గోవర్ధన్ ,రమేష్ రామ కృష్ణ కిట్టు జైరాం. నాగరాజు ప్రవీణ్ చాపల రమేష్ సందీప్ , రవి రాజు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.