రైతుల సమస్యలు కేసీఆర్ కి చెప్పడానికి సీనియర్ పత్రికేయుడి పాదయాత్ర
Published: Friday December 09, 2022
శంకరపట్నం డిసెంబర్ 08 ప్రజాపాలన రిపోర్టర్:
మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఆకుల సంజీవరావు సీనియర్ పాత్రికేయుడు బుధవారము స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి కరీంనగర్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సీఎం కేసీఆర్ను కలవడానికి పాదయాత్రగా బయలుదేరాడు. సీఎంని కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు ఉద్యమకాలంలో జర్నలిస్టులు ఉద్యమానికి చేసిన సేవలని గుర్తించాలని కెసిఆర్కు వివరించనున్నారు.
Share this on your social network: