వృద్ధ దంపతులను బంధువుల వద్దకు చేర్చిన మధిర రెస్క్యూ టీం

Published: Monday October 04, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 3 అక్టోబర్ఈ రోజ మధిరలో. హైదరాబాదు బొరబండ ప్రాంతానికి చెందిన. ఇద్దరు వృద్ధ దంపతులు. అబ్బాస్ అలీ ఖాన్. ఖాసీం బి (వికలాంగుడైన వృద్ధుడు). మధిర రైల్వే స్టేషన్లో ఎటు వెళ్ళాలో తెలియక.. రోడ్డు మీద పాకుతూ బాధ పడుతూ ఉండగా.. చుట్టుపక్కలవారు మధిర రెస్క్యూ టీం కు సంప్రదించగా దోర్నాల రామకృష్ణ వెళ్లి పరామర్శించి వారిని ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి తరలించడం జరిగింది. పది రోజుల తర్వాత వారికి సంబంధించిన బంధువులు బోరబండ హైదరాబాద్ నుండి ఈ రోజు మధిర వచ్చి సదరు వృద్ధ దంపతులను తీసుకువెళ్లటం జరిగింది. ఏ దిక్కు మొక్కు లేక రోడ్డు మీద అనాధలుగా సంచరించే వారిని అక్కున చేర్చుకున్న దోర్నాల రామకృష్ణకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సమాచారం సేకరించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఎస్సార్ నగర్ సీఐ సైదులు గారికి బోరబండ ఎస్సై కు దోర్నాల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.