27 వ డివిజన్ లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి

Published: Thursday May 20, 2021
బాలపూర్, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలిని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి సూచించారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ పలు కాలనీల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్వయంగా బుధవారం నాడు స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో ప్రజలు అందరూ ధైర్యంతో మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించినట్లయితే ఈ మాయదారి వైరస్ ను తరిమికొట్టొచ్చుని అన్నారు. కరోనా వల్ల ఎవరు ఇబ్బంది ఉన్న మాకు తెలియజేయాలని చెప్పరు.