స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావం * జిల్లా దళిత్ శక్తి ప్రోగ్రామ్ అధ్యక్షులు రవీందర్ మహారాజ్

Published: Friday September 16, 2022
వికారాబాద్ బ్యూరో 15 సెప్టెంబర్ ప్రజా పాలన : స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా పది కిలోమీటర్లు పాదయాత్ర చేశామని జిల్లా దళిత్ శక్తి ప్రోగ్రామ్ అధ్యక్షులు రవీందర్ మహారాజ్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దళిత్ శక్తి ప్రోగ్రామ్ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ,వికారాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా 10 కిమీ పాదయాత్ర చేశారు.
డాక్టర్ విశారదన్ మహారాజ్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల  స్వరాజ్య స్థాపన కై చేస్తున్న 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర 2022 మార్చ్ 15న నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ప్రారంభించి 2022 సెప్టెంబర్ 14 నాటికి 6 నెలలో 3,500 కిలో మీటర్లు,15 జిల్లాల మీదుగా పాదయాత్ర పూర్తి  చేశామన్నారు. స్వరాజ్య పాదయాత్రకు  సంఘీభావంగా దళిత్ శక్తి ప్రోగ్రామ్ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల సంఘీభావ పాదయాత్రను వికారాబాద్ జిల్లా ,వికారాబాద్ మండల్, మద్గుల్ చిట్టెంపల్లి గ్రామం నుండి వికారాబాద్ పట్టణ కేంద్రంలో పాదయాత్ర చేసి, గ్రంథాలయం దగ్గర గల స్వరాజ్య పాదయాత్ర  శిలాఫలకం  దగ్గర సభను నిర్వహించడం జరిగింది.
ఇందులో పాల్గొన్నవారు
వికారాబాద్ డిఎస్పి జిల్లా అధ్యక్షులు రవీందర్ మహారాజ్
డీఎస్పీ ఉపాధ్యక్షులు కృష్ణ మహారాజ్,
మరియు వివిధ  మండలాల గ్రామాల కార్యకర్తలు బీసీ ఎస్సీ ఎస్టీల సంఘం నాయకులు పాల్గొన్నారు.