మండలంలో పర్యటించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క

Published: Wednesday February 09, 2022
బోనకల్, ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి:బోనకల్ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క ఇటీవలే మరణించిన వంగాల నాగేశ్వరావు, రావుల వెంకటేశ్వరావు, వంగాల నారాయణ కుటుంబాలను పరామర్శించి గ్రామ శాఖ అధ్యక్షుడు గంగసాని రాఘవరావు ఇంటిదగ్గర గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం పై గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరికొంత మంది కుటుంబాలను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజవర్గ లీడర్ ఉమ్మ నేని రమేష్, బీసీ సెల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల పాపారావు, బీసీ సెల్ మండల కార్యదర్శి వంగాల రామారావు, గీత కార్మిక సంఘం ప్రెసిడెంట్ గుడి ద రాములు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాఘవరావు, దామల బాబు, మాజీ సర్పంచ్ తాటికొండ అచ్చయ్య ,గుజ్జర్లపూడి వినయ్, తాటికొండ జయరాజు తదితరులు పాల్గొన్నారు.