రామంతాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం

Published: Thursday February 17, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ నగర్లో మహిళల కల సహకారం కోసం మహిళా భవన్ ప్రారంభోత్సవం మరియు ఎన్నో ఏండ్ల నుండి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి భరత్ నగర్ రోడ్ నెంబర్ 10 లో గల సివరాజ్ పైప్లైన్ శంకుస్థాపన కార్యక్రమాలను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, డి ఈ నాగమణి, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, జెసిబి రాజు, సూరం శంకర్, శివ, బాల కుమార్, నెహ్రూ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్సింగరావు, జలంధర్, కుమార్, దయాకర్ రెడ్డి, ముత్తినేని జగదీష్, తాళ్ల బాల కృష్ణ, మంజుల గౌడ్, బీన పళ్లి స్వరూపారాణి, కొట్టాల బాలరాజ్, శ్రీకాంత్, రాజు ,కృష్ణ, బొడ్డుపల్లి లింగం, అలాగే భరత్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాండ్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.