ఆయిల్ పామ్ పంటల సాగు పై అవగాహన

Published: Saturday September 24, 2022

 జన్నారం, సెప్టెంబర్ 24, ప్రజాపాలన:  మండలంలోని దేవునిగూడ రైతు వేదిక నందు ఆయిల్ పామ్ పంటల సాగు యాజమాన్యం పై వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన, నిర్వహించటం జరిగిందని మంచిర్యాల డివిజన్ వ్యవసాయ సహయ సంచాలకులు అనిత, మాట్రిక్స్ కంపెనీ సీఈఓ ఉదయ్ కుమార్, శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలో మొవ్వు పురుగు నివారణ, ఆయిల్ పామ్ లో వేయవలసిన అంతర పంటలు గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సయ్యద్ అక్రం, రైతులు గుర్రం గోపాల్ రెడ్డి, కళ్లెం చుక్కా రెడ్డి, కళ్లెం బాపు రెడ్డి, అచ్చె వెంకటి, మునిగెల బుచ్చన్న, కళ్లెం తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు