తాడికల్ లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం
శంకరపట్నం మార్చి 29 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండలం తాడికల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి అధ్యక్షతన 2022-23 విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ మారుతున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని, దాని సాధనకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అదిరోహించాలనీ ఆయన ఆకాంక్షించారు. తాడికల్ పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావానికి నిదర్శనమని మండలంలోని వివిధ పాఠశాల కంటే ఈ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండడానికి వారి నిబద్ధతే కారణమని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కీసర సుజాత, ఎంపీటీసీ వరలక్ష్మి, పాఠశాల చైర్మన్ కోరిమీ సారంగపాణి, వైస్ చైర్మన్ రజిత తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: