కరోనా బాధితులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలి : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Thursday April 22, 2021
మేడిపల్లి, ఏప్రిల్21 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా బాధితులు, అనుమానితులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హోమియో వైద్యాధికారులకు సూచించారు. రామంతాపూర్ ప్రభుత్వ హొమియోపతి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్, వాక్సినేషన్, కోవిద్ పరీక్షల కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సంధర్బంగా కోవిద్ బాధితులు, అనుమానితుల కు ఏలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని హోమియో వైద్యాధికారులను అయన అదేశించారు .ఆసుపత్రి సూపరింటెండెంట్ విన్నపం మేరకు రోగుల అవసరం నిమిత్తం స్వచ్ఛ టాయిలెట్ లను ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి.వేణు సుకుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ కె.మోహన్ లాల్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, సూరం శంకర్, వినీష్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గోన్నారు.