భట్టి విక్రమార్క చొరవతో సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు

Published: Thursday October 07, 2021
మధిర, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిర కాంగ్రెస్ కార్యాలయం మధిర, మడుపల్లి లోని పలువురు అనారోగ్యంతో  వివిధ హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ అయిన ఖర్చు ను తమ కుటుంబ ఆర్దిక పరిస్థితులు దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందించాలని కోరుతూ. మధిర శ్యాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్క ద్వారా దరఖాస్తు చేసుకోగా మల్లుభట్టి విక్రమార్క సిఫార్సు మేరకు పలువురికి సీఎం సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కులను ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిశోర్, మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా చేతుల మీదుగా అందించటం జరిగింది, లబ్దిదారులకు వివరాలు నర్సింహారావు. మడుపల్లి..36,000, శైలజ 60,000 ,వారికి అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర మండల sc సెల్ అధ్యక్షులు దారా బాలరాజు మున్సిపల్ కౌన్సిలర్ కోన ధని కుమార్ మండల st సెల్ అధ్యక్షుడు తేజావతబాలునాయక్ టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, sc సెల్ పట్టణ అధ్యక్షుడు గద్దల లాలయ్య పట్టణ BC సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు కాంగ్రెస్ నాయకులు  ఆదిములం శ్రీనివాసరావు మైలవరపుచక్రి మొదలగు వారు పాల్గొన్నారు.