నరసింహారావు అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు..
Published: Thursday September 22, 2022
తల్లాడ, సెప్టెంబర్ 21 (ప్రజాపాలన న్యూస్):
సుమారు 50ఏళ్ల పాటు సుదీర్ఘకాలం గ్రామాభివృద్ధికి పాటుపడిన అభివృద్ధి ప్రదాత గణేశుల నరసింహారావుకు గ్రామస్తులు కడసారి వీడ్కోలు పలికారు. తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామ మాజీ సర్పంచ్, గంగదేవిపాడు మాజీ సొసైటీ చైర్మన్ గణేశుల నరసింహారావు మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం గ్రామంలో ఆయనకు అంతిమయాత్ర నిర్వహించారు. స్థానిక టిఆర్ఎస్ నేత గణేశుల రవి ఆధ్వర్యంలో అంతిమయాత్ర ప్రారంభమయింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర సుమారు ఒంటిగంట వరకు గ్రామంలోనే కొనసాగింది. గ్రామంలోని ప్రతి వీధికి యాత్ర కొనసాగింది. గ్రామంలో సర్పంచిగా, సొసైటీ చైర్మన్ గా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు కూడా భారీగా హాజరై ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, పాసం గులపాటి లక్ష్మీనారాయణ, కొ మ్మినేని వెంకటేశ్వరరావు అనుమోలు బుద్ధిసాగర్ తదితర నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. తొలుత నరసింహారావు మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టిఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.*
Share this on your social network: