నిర్మాణ పనులను వేగవంతం చేయాలి ** డిసిసిబి చైర్మన్ భోజ రెడ్డి ** ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 30 (ప్రజ

Published: Thursday December 01, 2022

డిసిసిబి బ్యాంక్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ భోజ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న డిసిసిబి బ్యాంక్ నిర్మాణ పనులను ఆసిఫాబాద్ సిఏసిఎస్ చైర్మన్ అలీ బిన్ అహ్మద్ తో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయనను ఆసిఫాబాద్ పిఎసిఎస్ చైర్మన్  అలీబిన్ అహ్మద్, వైస్ చైర్మన్ ప్రహల్లాద్ లు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి డిస్టిక్ డైరెక్టర్లు పరమేశ్వర్, పురుషోత్తం యాదవ్, వాకిడి పిఎసిఎస్ చైర్మన్ పెంటయ్య, సీఈఓ ఓజ్జల రమణ సిబ్బంది పాల్గొన్నారు.