నాయి బ్రాహ్మణ సంఘం కు 50,000 రూపాయలు అందజేశారు ​జెడ్ పి టి సి నిత్య నిరంజన్ రెడ్డి

Published: Wednesday February 16, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో మంచాల మండలం నాయిబ్రాహ్మణుల సంఘం అభివృద్ధి కొరకు వారి సంక్షేమం కోసం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి 50వేల రూపాయలు అందజేశారు, నిత్యం నాయిబ్రాహ్మణులు నిలబడి కష్టించి పని చేస్తారు కాబట్టి వారికి ఆరోగ్య రీత్యా తన సొంత నిధులతో ఇన్సూరెన్స్ పాలసీలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్ రెడ్డి,  ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, మరియు నాయి బ్రాహ్మణుల సంఘం మండల అధ్యక్షులు ఎన్నుదుల సురేష్, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు ఆశ్వల వెంకటేష్, మడుపు వెంకటేష్, సభ్యులు బాలరాజు, నర్సింహ, జంగయ్య, సురేష్, రాజు, జెగన్, మహేష్, బాల రాజు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణుల సంఘం సభ్యులు మన సంక్షేమం కోసం తోడ్పాటు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మర్రి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.