సగర సంఘం నూతన కమిటీని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకటరావు

Published: Wednesday April 19, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ సగర సంఘం నాయకులు, కులపెద్దల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
సగర సంఘం నూతన అధ్యక్షులుగా
వేముల తిరుపతయ్య సగర, ప్రధాన కార్యదర్శిగా నీరెడీ రమేష్ సగర కోశాధికారి కొమ్ముల మన్యం సగర ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులందరినీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక    కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సగరుల ఉద్దేశించి ప్రభాకర్ మాట్లాడుతూ సగరులు అంటే ఎంతో చరిత్ర ఉన్న వారని సమస్త మానవాళి కోసం కఠోర తపస్సు చేసి దివి నుండి  భువికి గంగను తెచ్చిన అపర భగీరథ మహర్షి వారసులు సగరులు అని కొనియాడారు. సగర కులస్తులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు
ఉపాధ్యక్షులు అతినారపు నిరంజన్ సగర, సంగిశెట్టి రాములు సగర, కొమ్ముల రామస్వామి సగర,
మెాళ సైదులు సగర,
జాయింట్ సెక్రటరీ, మెాల స్వామి సగర, గవిని బొందయ్య సగర, అతినారపు రాములు సగర, మండలి వెంకట స్వామి సగర, సగర సంఘం గౌరవ సలహాదారులుగా కోడిపాక సౌజన్ సగర
అతినారపు బాలయ్య సగర, 
ఆవుల రామస్వామి సగర,గవిని కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.