బనిగండ్లపాడు ఆరోగ్య కేంద్రంలో ప్రికాష్ నరి డోస్ ప్రారంభం

Published: Tuesday January 11, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : బనిగండ్లపాడు ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రాజు, సుధాకర్ నాయక్ ఆద్వర్యంలో ప్రికాష్ నరి డోస్ లో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లలైన వైద్యసిబ్బంది, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఐ.కె.పి సిబ్బందికి మరియు 60 సంవత్సరాలు నిండి రెండవడోస్ తీసుకొని 9నెలలు నిండి మెసేజ్ వచ్చినవారు 3వడోస్ తీసుకోవడానికి అర్హులుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, 3వ దశలో ఓమెక్రన్ వైరస్ విజృంభిస్తున్నందున అర్హులైన ప్రతిఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని, అందరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్ తో చేతులు శుబ్రపరచు కోవాలని, సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఇ ఓ సదాశివరావు, పి హెచ్ ఎన్ రాణి, హెల్త్ అసిస్టెంట్స్ శాయిరెడ్డి, సుధాకర్, స్టాఫ్ నర్స్ లు రోజా, నసీమా, ఏఎన్ఎంలు సరళ, రత్నమ్మ, రత్నమాల, నాగమణి, మరియు ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.