ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Published: Wednesday June 15, 2022

రాయికల్, జూన్14 (ప్రజాపాలన ప్రతినిధి): అక్రమంగా తరలిస్తున్న మైతాపూర్ కు చెందిన ఇసుక ట్రాక్టర్ ను గత రాత్రి పట్టుకున్నట్లు  రాయికల్ తహసీల్దార్ దిలీప్ నాయక్ తెలిపారు . అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తీసుకొస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనుమతులు ఉంటేనే ఇసుకను తీసుకురావాలని,లేనిచో తీసుకురాకూడదని ఇసుక ట్రాక్టర్ యజమానులకు సూచించారు.