ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే సంజయ్

Published: Thursday September 30, 2021
జగిత్యాల, సెప్టెంబర్, 29 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ పావని కంటి దవాఖానలో మంగళవారం జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 21 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేసినారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేత్ర సమస్యలతో బాధపడుతూ చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిరుపేదలకు నావంతు సహాయంగా ఉచితంగా ఆపరేషన్లు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్ రాయికల్ వైస్ ఎంపీపీ మహేశ్వర్ రావు, గాదె తిరుమల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.