తల్లిదండ్రులను కోల్పోయి అనాధ గా మిగిలిన చిన్నారి ఆలేఖ్య కు అండగా ఏ.బీ.జే.ఎఫ్

Published: Saturday February 25, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రం లో ఈర్ల ఆలేఖ్య ( వయస్సు: 14 ) తండ్రి ఆనంద్‌
ఆరోగ్యం బాగాలేక దాదాపు ఒక సంవత్సరం క్రితం చనిపోయాడు.అలాగే తల్లి లక్ష్మి కూడా ఇటీవల  వారం రోజుల క్రితం చనిపోయింది ఆలేఖ్య అనాధగా మారిపోయిందని వివిధ పత్రికలలో ప్రచురిమైన విషయం తెలిసిందే. శుక్రవారం రోజున అలేఖ్య కు తక్షణ సహాయం క్రింద జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఇంద్రాల హరీష్  చేతుల మీదుగా 12,000/- రూపాయలను అందిచారు.రానున్న రోజుల్లో అలేఖ్య చదువులకు సంబధించిన విషయంలో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా కమిటీ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఇంద్రాల హరీష్, ఉపాధ్యక్షులు కాశిరెడ్డి వెంకట్ రెడ్డి, కోరుట్ల డివిజన్ అధ్యక్షులు వనతడుపుల మహాతేజాలు పాల్గొన్నారు.