వర్షాల ప్రభావితంలో అప్రమత్తంగా తల్లిదండ్రులు పిల్లల జాగ్రత్తలు చూసుకునే బాధ్యతగా చూడాలి
Published: Friday October 07, 2022
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం యాచారం మండల పరిధిలో తాడిపర్తి గ్రామంలోని ఈమధ్యనా తాటిపర్తి గ్రామంలో ఎర్రగుంట చెరువులో పడి నలుగురు చిన్నారులు చనిపోయిన విషయం తెలుసుకొని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు గుండాలు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయంగా 10000 పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొవాలని పకృతి విపత్తు కింద వచ్చే మూడు లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు ధార దశరథ, ధార రాజు, ధార వెంకటేష్, దార రామనాధం, పెరుమాండ్ల శివ,చిలుకల బుగ్గరాములు,దార జైపాల్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: