బాచారం కల్వర్టు నిర్మాణం పనుల పరిశీలన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published: Thursday July 14, 2022
వికారాబాద్ బ్యూరో జూలై 13 ప్రజాపాలన : 
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని బాచారం  వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్ పి కోటిరెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డిలతో కలిసి పరిశీలించారు.
వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించిన మంత్రి సబితా రెడ్డి. నదుల వద్ద పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు  నిర్వహించాలని, ప్రవాహ వేగాలు గమనించకుండా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని మంత్రి ప్రజలను హెచ్చరించారు.