సమత సైనిక్ దళ్ నిజామాబాద్ జిల్లా ఆర్గనైజర్ మార్షల్ కపిల్ కలేవార్.

Published: Tuesday December 06, 2022
హైదరాబాద్ 5 డిసెంబర్ ప్రజాపాలన:
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నిర్యాణం డిసెంబర్ 6 సందర్భంగా మహా పరినిర్వాణ దినోత్సవం ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముంబైలో  సమత సైనిక్ దళ్ శిక్షణా శిబిరం మార్షల్ కపిల్ కలేవార్ ఆద్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు.శిబిరంలో తెలంగాణ యూనిట్ సైనికులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా  సమత సైనిక్ దళ్ 
ఆర్గనైజర్ మార్షల్ కపిల్ కలేవార్ మాట్లాడుతూ...
ప్రతి ఇంట్లో ఒక  సమత   సైనికుడు ఉండాలి అని అభిప్రాయపడ్డారు. డాక్టర్. బాబాసాహెబ్   అంబేద్కర్ ఆలోచనలు, బాబాసాహెబ్ సంస్థలు జీవం పోస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆనాడే   సమాజానికి న్యాయం జరుగుతుందని తెలిపారు.