అనాధ విద్యార్థులకు అంబేద్కర్ సంఘం చేయూత

Published: Monday May 16, 2022
 ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మే 15:
బొమ్రాస్‌పేట: మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామానికి, కడంపల్లి కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అనాధలుగా మారడంతో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఉదార స్వభావం స్పందించి విద్యార్థులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. సంఘ సభ్యులు అంతా వ్యక్తిగతంగా విరాళాలు సేకరించారు. పోగు చేసుకున్న రూపాయలు 19,000 ఆర్థిక సాయంను ఆదివారం అనాధ విద్యార్థినులు అక్క తమ్ముడు అయిన గడ్డంపల్లి వెన్నెల, వంశీలకు అందించారు. అలాగే విలేకరి అంజిలప్ప, మాజీ ఉప సర్పంచ్ చంద్రప్ప రూపాయలు 2000 అందజేశారు. మొత్తం రూ 21,000 నగదును అందజేశారు.