చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా.సంజయ్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణ

Published: Friday December 24, 2021

జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలోని కండ్లపెళ్లి చెరువు మరియు మోతె చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ పరిశీలించినారు. ఈ సందర్భంగా జరుగుతన్న పనులలో అలసత్వం పై అసహనం వ్యక్తం చేశారు, చెరువు కట్ట అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట కమిషనర్ స్వరూప రాణి, డి.ఈ రాజేశ్వర్ రావు, ఏ.ఈ ఆయుబ్ ఖాన్, కౌన్సిలర్లు క్యాదాసు నవీన్, పంబాల రాము, తోట మల్లికార్జున్, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, కో ఆప్షన్ రియాజ్ మామా, నాయకులు సాగర్ రావు, పట్టణ ఉపాధ్యక్షుడు దూమల రాజ్ కుమార్,పరశురామ్ గౌడ్, డిష్ జగన్, సుల్తానీ అహ్మద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.