మేడేపల్లి శ్రీనివాసరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మధిర రూరల్

Published: Wednesday September 07, 2022
సెప్టెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడికి పనిచేస్తున్న మేడేపల్లి శ్రీనివాసరావు కలెక్టర్  చేతులు మీదుగాగురుపూజోత్సవం సందర్భంగా  సోమవారం రాత్రి ఖమ్మం డీపీఆర్ ఓ కార్యాలయం నందు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ యస్ యాదయ్య అధ్యక్షతన జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డుల ప్రధానo ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర మండలం మాటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావుకు 2022 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ట్రైనీ కలెక్టర్ రాధికా గుప్త  చేతుల మీదుగా, మెమంటో, సర్టిఫికెట్ అందిస్తూ దుస్సాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా మేడేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అనునిత్యం ప్రతి విషయంలోను ప్రోత్సాహం అందిస్తున్నమధిర యంఇఓ శ్రీ వై ప్రభాకర్ , సేఫ్ హాండ్స్ ఫౌండేషన్ కళ్యాణ చక్రవర్తి , మాటూర్ హైస్కూల్ హెచ్ఎమ్ సాయికృష్ణ, సహా ఉపాధ్యాయ సిబ్బందికి హోమియో హాస్పిటల్ మిత్రులకు,తన కుటుంబ సభ్యులు, బందుమిత్రులకు, ఉపాధ్యాయ మిత్రులకు, తనవద్ద విద్య నేర్చుకున్న పూర్వ, ప్రస్తుత విద్యార్థులకు గ్రామస్తులకు, ముఖ్యంగా తన శ్రమకు అక్షరరూపం అందిస్తూ ఈ అవార్డు సాధనలో కీలక భూమిక వహించిన ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేసారు.
 
 
 
Attachments area