ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి *రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్య

Published: Saturday December 03, 2022

రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా, పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మండల పార్టీ అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు  అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ, చెర్ల పటేల్ గూడ గ్రామాలలో ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆదేశానుసారం టిఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 మంది టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, సర్పంచులు పవిత్ర కుమార్, గీత రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్, హరి ప్రసాద్, నాయకులు గణేష్, మైసయ్య, హనుమంత్ రెడ్డి, శివ, రాజేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, లింగ రెడ్డి, శేఖర్, యాదయ్య, ప్రసన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.