మాధవసేవే మానవసేవ అంటూకె ఎస్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ.

Published: Friday December 09, 2022
మధిర రూరల్ డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మాధవసేవే మానవసేవ అంటూ కే సి జఫౌండేషన్ఆధ్వర్యంలోమున్సిపల్ కార్మికులకు, వార్డు మహిళలకు చీరలు పంపిణీ.
కె ఎస్ జి (కోనా సత్యనారాయణ గుప్తా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా మున్సిపాలిటీ కార్మికులకు వార్డు లోని మహిళలకు కోనా లక్ష్మీకాంతమ్మ వారి కుమారుడు కోడలు కోనా నరసింహారావు, కోనా లక్ష్మీ సావిత్రి ఆధ్వర్యంలో గురువారం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోనా నరసింహారావు మాట్లాడుతూ.మా తండ్రి కోనా సత్యనారాయణ గుప్తా పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు బలుగు బడిన వర్గాలకు చెందిన నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోనా లక్ష్మీకాంతమ్మ, కోనా లక్ష్మీ సావిత్రి,కనపర్తి ప్రకాష్, కొత్తమాసు వెంకటేశ్వరావు, వేముల నవీన్ కుమార్, మల్లేష్ ఎంపిటిసి కామేపల్లి, వె చ్చా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.