కమిషనర్ శ్రీనివాస్ కు వీడ్కోలు పలికిన కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్
Published: Friday October 01, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ పదోన్నతి పై బదిలీ అయిన సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాలకవర్గం, అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 15 డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్, డివిజన్ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: