*మునుగోడు మొనగాడు* -అభివృద్ధికి జై కోట్టిన ప్రజలు

Published: Monday November 07, 2022
(ప్రజాపాలన)చేవెళ్ల 06: -

ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నటువంటి మునుగోడు ఉప ఎన్నిక, ఫలితాలు నేటితో టిఆర్ఎస్ విజయంతో ముగిసింది.
మిత్రపక్షల టిఆర్ఎస్ భ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం పట్ల
  చేవెళ్ల శాసనసభఎమ్మెల్యే కాల యాదయ్య హర్షం వ్యక్తం చేశారు.
చేవెళ్ల మండల కేంద్రంలోని  అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యేేే కాలే యాదయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీటీసీలు కార్యకర్తలు మిత్రపక్షాల నాయకులు
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం ప్రభు లింగం, సిపిఎం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అల్లి దేవేందర్ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి పథకాలే ఈరోజు టిఆర్ఎస్ గెలుపుకు ప్రధానకారణమని ఈ ఉత్కంఠగ సాగిన ఫోరులో బిజెపి జిమ్మిక్కులు పనిచేయలేవని, ప్రజలు ఎప్పుడు కెసిఆర్ వెంటే ఉన్నామని ఈ గెలుపుతో రుజువు చేశారని అన్నారు. సిపిఐ రైతు సంఘం నాయకులు ప్రభులింగం మాట్లాడుతూ మతోన్మాద బిజెపిని ఓడించి టిఆర్ఎస్ ను గెలిపించడం శుభకరమని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాద బీజేపీని తుద ముట్టించాలని అయన అన్నారు.ఈ కార్యక్రమంలోనాయకులు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్టరంగారెడ్డి వైస్ ఎంపీపీ ప్రసాద్ మణిక్య రెడ్డి, మల్లేష్ శివయ్యతదితరులు పాల్గొన్నారు.