జంట కార్పొరేషన్లలో ఘనంగా

Published: Saturday April 15, 2023
 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
మేడిపల్లి, ఏప్రిల్ 14 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదీగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీర్జాదీగూడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు, నాయకులు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బోడుప్పల్లో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 
పీర్జాదీగూడ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్యాలయం వద్ద స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ నాయకులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు  అర్పించారు.
పీర్జాదీగూడ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు