పిఆర్ సి 12 నెలల బకాయిలను జి పిఎఫ్ లో కలపాలి

Published: Friday July 02, 2021

టి యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు డిమాండ్
మంచిర్యాల టౌన్, జూలై 01, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుదవారం రోజున టి యు టి ఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జూమ్ ద్వారా నిర్వహించుకుని పలు విషయాలు చర్చించినట్లు జిల్లా అధ్యక్షులు పత్తి సత్తయ్య తెలిపారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి 12 నెలల బకాయిలను పదవీ విరమణ చేసిన అనంతరం ఇస్తామనడం సరికాదని వాటిని వెంటనే జి పి ఎ ఫ్ అకౌంట్ లో జమచేయాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అని తెలిపారు.