గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రవిశంకర్.

Published: Monday September 12, 2022
 కొడిమ్యాల, సెప్టెంబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి పుడూర్ నకు నాబార్డ్ వారి ఆర్థిక  సహకారంతో 500 మీటర్ల గోదాం  38 లక్షల  అంచనా వ్యయంతో మంజూరయినది. ఇట్టి గోదాం నిర్మాణమునకు ఈరోజు ఎమ్మెల్యే  రవిశంకర్  భూమి పూజ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు శ్రీ బండ రవీందర్ రెడ్డి, సంఘ డైరెక్టర్లు  బండ నర్సింహ రెడ్డి,  కడారి మల్లేశం, కంబల్ల ఐలయ్య, గోగూరి నాగభూషన్ రెడ్డి, కోలాపురి బాబమ్మ, బొక్కేన మల్లయ్య, సర్పంచులు ఫోరమ్ అధ్యక్షులు  పునుగోటి కృష్ణారావు, తీర్మాలపూర్ సింగిల్ విండో  అధ్యక్షులు పోలు రాజేందర్ ఏఎంసీ మల్యాల   అధ్యక్షులు కోరండ్ల నరేందర్ రెడ్డి,  పుడూర్ గ్రామ సర్పంచ్ పెద్ది కవిత రవికుమార్, అప్పారావు పేట సర్పంచ్ గరిగంటి మల్లేశం, నర్సింహులపల్లి సర్పచ్ తిరుపతి , వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్ చేప్యాల ఎంపీటీసీ  ఊట్కూరి మల్లారెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు బీరయ్య , నాగరాజు, టిఆర్ఎస్  మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ మరియు వివిధ గ్రామలనుండి నాయకులు బొడ్డు రమేష్, మ్యాకల మల్లేశం , ఒల్లల లింగాగౌడ్, ముమ్మాడి రామస్వామి ,అనుమండ్ల అజయ్ పూడూర్ గ్రామ వార్డు మెంబర్లు  రైతులు సంఘ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగినది.