9వ డివిజన్ లో మొక్కలు నాటడం

Published: Friday August 06, 2021
బాలాపూర్: ఆగస్టు 05 ప్రజాపాలన ప్రతినిధి : మేయర్, డిప్యూటీ మేయర్ కాలనీ వాసులతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలినీ, ఆ బాధ్యతగా భావించుకోవాలిని చెప్పారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి లో 9వ డివిజన్ కార్పొరేటర్ శివ పార్వతి నరసింహ్మ ఆధ్వర్యంలోని విజ్ణాన్ పురి కాలనీ లో బుధవారం నాడు హరిత హారం కార్యక్రమంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... నాటి మొక్క రేప్ మహావృక్షంగా తయారవుతుందని, మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలిని అన్నారు. కార్యక్రమానికి  కార్పోరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, బిజెపి ప్లోర్ లీడర్  కార్పోరేటర్  కీసర గోవర్ధన్ రెడ్డి, బిక్షపతి చారి, భీమ్ రాజ్, హరినాధ్ రెడ్డి, కాలని అధ్యక్షుడు గడ్డం మంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.