18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలి

Published: Friday September 17, 2021
మధిర, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : 9వ వార్డు కౌన్సిలర్ మల్లాది సవిత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరోనా సోకకుండా కరోనా రక్షణ టీకా తీసుకోవాలని 9వ వార్డు కౌన్సిలర్ మల్లాది సవిత కోరారు. గురువారం వార్డులో నిర్వహిస్తున్న కరోనా టీకా నమోదు పరిశీలన కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లాది సవిత మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సూచనల మేరకు 9వ వార్డులో ఎంతమంది కరోనా టీకా తీసుకున్నారో? తెలుసుకునేందుకు సిబ్బంది చేపడుతున్న ఇంటింటి సర్వే పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ నీరుకొండ ప్రతిమ ఆశా వర్కర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు