మానవత్వంతో కంటి వెలుగును ప్రోత్సహించాలి
Published: Monday January 09, 2023
* బోనం ఎత్తిన చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 08 జనవరి ప్రజాపాలన : 25వ వార్డు ప్రజలు బుర్జుమైసమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చైర్ పర్సన్ స్వంత వార్డులోని బుర్జుమైసమ్మ దేవాలయంలో అంగరంగవైభవంగా నిర్వహించిన ముగింపు ఉత్సవాలకు హాజరై అమ్మవారికి బోనం అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మంజుల రమేష్ వార్డు ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారిని భక్తిప్రపత్తులతో కొలిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని స్పష్టం చేశారు. 25వ వార్డు ప్రజలతోపాటు పట్టణ ప్రజలు అందరూ సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ పూజ కార్యక్రమంలో వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network: