ఘనంగా శ్రీ చైతన్య పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

Published: Monday February 13, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి)
 పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని శ్రీ చైతన్య పాఠశాల వార్షికోత్సవ వేడుకలను 
యం కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథలుగా  మేయర్  జక్క వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు బొడిగె స్వాతి కృష్ణ గౌడ్,  దొంతి హరి శంకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డిలతో పాటు దాసోజు శంకరమ్మ హాజరై దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు చేసిన వివిధ రకాల నృత్యాలతో చూపరులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు కళాత్మకమైన భావన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్  శ్రీలత, రమేష్ బాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా శ్రీ చైతన్య స్కూల్లోని విద్యార్థుల గణనీయమైన ఉత్తీర్ణతతో పాటు కలలు, క్రీడల పట్ల ఆసక్తి కనపరుస్తూన్నారని తెలిపారు. ఇందులో విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.