బీజేపీ శ్రేణుల కృషి త్యాగాల తోనే విజయం తథ్యం

Published: Wednesday March 03, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; జాతీయ ప్రధాన కార్యదర్శి బిజెపి శ్రీ తరుణ్ చుగ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో  కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామ నివాసి అయినటువంటి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ తరుణ్ చుగ్ గారిని హైద్రాబాద్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది, కోలన్  శంకర్ రెడ్డి వారితో తెలంగాణ రాష్ట్ర అంశలపై చర్చించడం జరిగింది, ఈ సందర్భంగా శ్రీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ...... రాష్ట్రంలో బలపడడానికి రేపు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక, మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి శ్రేణులందరిని ప్రోత్సహించి గెలుపేద్యేయం గా పనిచేయాలన్నారు. ఈ ఎన్నిలలో బిజెపి గెలిచి, భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారాన్ని బిజెపి కైవసం చెడకుంటుదని ఆయన చెప్పారు. 40 సం ల బిజెపి శ్రేణులు కృషి, త్యాగలతోనే విజయాలు సాధిస్తుందన్నారునీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కొలన్ శంకర్ రెడ్డి, దినేష్, నరేంద్ర చారి, రమేష్ ప్రానేశ్, దీప్ కుమార్ ఇతరులు పాల్గోన్నారు.