ఎల్లమ్మ తల్లి బోనాల జాతరకు హాజరైన ఎమ్మెల్యే - డాక్టర్ సంజయ్ కుమార్
Published: Monday May 16, 2022
రాయికల్, మే14 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో ఎల్లమ్మ బోనాల జాతరకు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కె. సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, (అమ్మవారి) ఎల్లమ్మ తల్లి గదను పట్టుకొని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భక్తితో నృత్యంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు అశ్విని జాదవ్, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సాగరిక శ్రీనివాస్, నందు మల్లేశం, శ్రీనివాస్, వెంకటేశం, గ్రామశాఖ అధ్యక్షుడు రంజిత్, వెంకటేశ్వరరావు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: