చేవెళ్ళలో నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గం. ప్రమాణస్వీకారం -రైతులు అందరు మెచ్చే పని చేయాలి, - మ

Published: Tuesday October 11, 2022
చేవెళ్ళ అక్టోబర్ 10 (ప్రజాపాలన ):
 
మండల కేంద్రంలోని కె జి ఆర్ గార్డెన్ లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.... ప్రతి మండలానికి ఒక మార్కెట్ కమిటీలు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే యాదయ్య దన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పై బీజేపీ నేతలు  దండయాత్ర చేస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ఉన్న పథకాలు, కేంద్రంలో అమలు చేస్తున్నారా అంటూ ఈ సందర్బంగా వారు బిజెపిని ప్రశ్నించారు. కుల,మతాల మధ్య చిచ్చుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మూఢ క్షుద్ర పూజల్లో మునిగిన బండి సంజయ్ కి మతి భ్రమించిందన్నారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ గా బేగరి నర్సింలు ఎన్నికయారు. డైరెక్టర్లు బూర్ల సుమలత, బి మహేష్, టీ వెంకటయ్య, ఎంకమొళ్ళ కృష్ణ, కె తిరుపతిరెడ్డి, జి కరుణాకర్ రెడ్డి, ముధవార్ కృష్ణ నాయక్, ఎండి ఫయాజుదిన్, ఎస్ శ్రీనివాస్ గౌడ్, ఆర్ వెంకటేష్, కే సతీష్ కుమార్, ఎం చంద్రశేఖర్ రెడ్డి, ఎడి రమాదేవి, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి వెంకటేశ్వర్ రెడ్డి,  జెడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, డి సి యం ఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పెద్దలు ప్రభాకర్, భర్కల బలరాం రెడ్డి, పామిడి సర్పంచి మల్లారెడ్డి, దేవరపల్లి సర్పంచ్ నరహరి రెడ్డి, మురుమళ్ళ సర్పంచి స్వర్ణలత దర్శన్, వైస్ ఎంపీపీ కర్ర శివప్రసాద్, టిఆర్ఎస్వి నాయకులు నరేందర్ గౌడ్, పౌరసరఫరాల డైరెక్టర్  రవీందర్, సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు  పాల్గొన్నారు.