యాదవుల రాజకీయంగా ఆర్దికంగా బలోపేతం కావాలి: బర్ల జగదీష్ యాదవ్

Published: Monday October 17, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 16ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం   మంచాల మండలంలో మల్లికార్జున గార్డెన్ లో జరిగిన అఖిల భారతీయ యాదవ సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బర్ల జగదీష్ యాదవ్.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు గ్రామస్థాయి నుంచి  రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు, పోచమోని జంగయ్య,బర్ల శివయ్య,గునుకుల సోమయ్య,మల్లయ్య మరియు మలి దశ ఉద్యమ వీర వనిత బెల్లి లలిత ను పోరాట స్ఫూర్తి గా తీస్కొని ముందుకు పోవాలని,ఇబ్రహింపట్నం లో త్వరలో బెల్లి లలిత విగ్రహం మరియు  బెల్లి లలిత యాదవ్ భవన్ నిర్మిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదవ సంఘం నాయకులు పగడాల యాదయ్య. బద్దుల బాలరాజ్. కసర మూవీ మల్లేష్. ముచ్చర్ల వెంకటేష్. చీమల కృష్ణ. గజ్జి ఐలయ్య.కొట్టం సత్యం. నర్ల కృష్ణ.బూరుగు ఐలేష్. ఆవుల శీను. కసర మోని మహేందర్. ఎలుగపల్లి శ్రీరామ్. బైకాని మహేందర్. ఆవుల ప్రశాంత్ యాదవ్. కసర మోని రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.