కవ్వాల్ టైగర్ జోన్ లో ఎఫ్ ఆర్ వో లకు శిక్షణ

Published: Thursday January 19, 2023

జన్నారం, జనవరి 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ లో ఎఫ్ ఆర్ ఓ లకు శిక్షణ కల్పించడం జరిగిందని బుధవారం ఎఫ్ డి ఓ మాధవరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9వ బ్యాచ్ ప్రో ట్రైనీలకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ల్యాండ్, మేనేజ్మెంట్,  పక్షులు, జంతువులు, కలప, ఆవాసాల పెరుగుదల, గురించి ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన గుజరాత్ కు 42 మంది జమ్మూకు నలుగురు లడక్ ఒకరు టోటల్ 47 మంది శిక్షణ ఎఫ్ఆర్వాలు కవ్వాల్ టైగర్ రేంజ్ లో పర్యటించి వన్యప్రాణుల కోసం ఏర్పాటుచేసిన నీటి గుంటలను సూచించారు. మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ అడవి పరిధిలోని  చేపట్టిన ఇతర అభివృద్ధి పనులను అటవీ అధికారులు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జన్నారం రేంజ్ అధికారి హపిజోద్దిన్, తాసిల్దార్ చిట్యాల కిషన్, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.